News March 19, 2024
దోర్నాల : ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వ్యక్తి మృతి

ప్రకాశం జిల్లా దోర్నాల చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిలకలూరిపేట వద్ద జరిగిన ప్రజాగళం సభకు వెళ్లి తిరిగి వస్తుండగా వినుకొండ సమీపంలో స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కుటుంబ భారాన్ని మోసే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు.
Similar News
News March 5, 2026
మార్కాపురం: ప్రియురాలు పిలిచిందని వచ్చి దొరికాడు.!

మార్కాపురానికి చెందిన వ్యక్తిపై గుంటూరులో దాడి జరిగింది. ఈ ఘటనపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో ఉండటం ఇష్టం లేని వివాహిత ఆమె ప్రియుడు నాగసాయికృష్ణకు చెప్పింది. ఈ క్రమంలో నాగసాయికృష్ణ మార్కాపురం నుంచి గుంటూరు వచ్చాడు. విషయం తెలుసుకున్న వివాహిత భర్త దినకర్ మరికొందరితో కలిసి నాగసాయికృష్ణపై కర్రలతో దాడిచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 5, 2026
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం..

ప్రకాశం(D)లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. V.Vపాలెం (M) పోలినేనిపాలెంకి చెందిన పాపారావు తన కుమారుడు శ్రీకాంత్తో కలిసి విప్పగుంట పొలాల్లో గొర్రెలు మేపుతున్నారు. కోనేరుకుంట వద్ద అన్నం తిని మంచినీటి కోసం శ్రీకాంత్ బావిలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. కుమారుడిని రక్షించేందుకు బావిలోకి దిగిన తండ్రి పాపారావు కూడా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తండ్రీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
News March 5, 2026
CS.పురం PSలో మొక్క నాటిన SP

మార్కాపురం జిల్లా చంద్రశేఖరాపురం మండల కేంద్రం పోలీస్ స్టేషన్ను జిల్లా SP హర్షవర్ధన్ రాజు బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణను పరిశీలించి తగు సూచనలు చేశారు. బిల్డింగ్ కేసులు వివరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై తీసుకుంటున్న చర్యలు CI మాకినేని శ్రీనివాసరావు, వెంకటేశ్వర నాయక్తో చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.


