News February 6, 2025

10న నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మం: కలెక్టర్

image

జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ నెల 10వ తేదీన అల్బెండ‌జోల్ మాత్ర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌న్నారు. వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టి కృషితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మానికి సంబంధించిన గోడ ప‌త్రిక‌లు, క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించారు.

Similar News

News July 6, 2025

సిగాచీ పరిశ్రమలో కొనసాగుతున్న సహాయక చర్యలు: కలెక్టర్

image

సిగాచీ పరిశ్రమలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తొమ్మిది మంది ఆచూకీ ఇంకా లభించలేదని చెప్పారు. 34 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. 9 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించినట్లు వివరించారు.

News July 6, 2025

ఖమ్మం డీసీసీబీ బంగారు తాకట్టు రుణాలాలో టాప్

image

ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు బంగారు తాకట్టు రుణాల మంజూరులో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిచింది. 57,519 మంది దాదాపు రూ.765 కోట్ల మేర బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు తీసుకున్నారు. మరో వారంలోగా ఇది రూ.800 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందంగా ఉందని ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు అనందం వ్యక్తం చేశారు.

News July 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుత సంచారం

image

మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ అటవీ ప్రాంతంలోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత సంచారంపై 4 రోజులుగా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని రైతులు అన్నారు. శనివారం గుట్టలోని గుండుపై చిరుత కనిపించగా పొలాల వద్ద పశువులు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. అప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.