News February 6, 2025
HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు
కామారెడ్డి డిక్లరేషన్కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.
Similar News
News February 7, 2025
కోటగిరి: ఎత్తోండ క్యాంపులో అక్రమ ఇసుక డంపులు
కోటగిరి మండలం ఎత్తోండ క్యాంపును అడ్డగా మలుచుకున్న కొందరు ఇసుక సూరులు యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద గల ఖాళీ స్థలంలో ఇసుక డంపులు చేసి రాత్రికి రాత్రి వాటిని టిప్పర్ల ద్వారా బోధన్, నిజాంబాద్ పట్టణాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఈ విషయమై గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
News February 7, 2025
ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్
ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
News February 7, 2025
నిజామాబాద్లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ వద్ద గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో మాక్లూర్కు చెందిన షేక్ ఫర్వాన్ (24), షేక్ ఇంతియాజ్ (22) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా లారీ డ్రైవర్ పరారైనట్లు ఎస్ఐ ఆరీఫ్ వెల్లడించారు.