News February 6, 2025
HYD: రేవంత్ చిత్రపటాలు తగలబెట్టాలి: రామచంద్రరావు

కామారెడ్డి డిక్లరేషన్కు విరుద్ధంగా అసెంబ్లీలో తీర్మానానికి చేసినందుకు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారా? అంటూ కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు నిలదీశారు. తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషను విలువలేకపోతే రేవంత్ దాన్ని తగులబెట్టి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత చులకనా అంటూ డిమాండ్ చేశారు.
Similar News
News April 2, 2026
పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఆపేశాం.. లేదంటేనా: నేవీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ పాత్రపై చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరికొన్ని నిమిషాల్లో నేవీ పాక్ తీరప్రాంతంపై భారీ దాడులతో విరుచుకుపడనుందనగా ఆ దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. వెంటనే దాడులు ఆపాలని వేడుకోవడంతో వ్యూహాలను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో సేవలకుగాను నేవీ అధికారులకు యుద్ధ్ సేవా మెడల్స్ ప్రదానం సందర్భంగా చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News April 2, 2026
చరణ్ అన్న సలహా కచ్చితంగా పాటిస్తా: నిహారిక

నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామ్చరణ్ తనకు సలహా ఇచ్చారని మెగాడాటర్ నిహారిక చెప్పుకొచ్చారు. చరణ్ అన్న చెప్పిన ‘నెవర్ సే నెవర్’ రూల్ కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా తాను నిర్మించనున్న <<19495867>>’బరి’<<>> సినిమా బడ్జెట్ ₹60కోట్లు అని వెల్లడించారు. దీంతో నిర్మాతగా నిహారిక కెరీర్లో ‘బరి’ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.
News April 2, 2026
మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.


