News February 6, 2025

భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 7, 2025

NZB: CPకి MIM నాయకుల వినతి

image

రంజాన్ నేపథ్యంలో అర్ధరాత్రి దుకాణాలు తెరవడానికి అనుమతించాలని కోరుతూ MIMనాయకులు గురువారం నిజామాబాద్ ఇన్‌ఛార్జి CP సింధూశర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ నెల 13, 14 తేదీల్లో షబ్-ఎ-బరాత్, రంజాన్ మాసం సందర్భంగా అహ్మదీ బజార్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, ఖిల్లా రోడ్, బోధన్ చౌక్ ప్రాంతాల్లో అర్ధరాత్రి దుకాణాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. 

News February 7, 2025

చౌడమ్మ కొండూరులో పోటెత్తిన భక్తజనం

image

నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలో స్వయంభుగా వెలసినటువంటి చాముండేశ్వరి దేవి అమ్మవారి ఆలయం పునర్నిర్మించి నూతన విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవాలలో భాగంగా ఇవాళ చండీ హోమం నిర్వహించారు. చుట్టుపక్కల ఉమ్మడి మండలంలోని భక్తులంతా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అమ్మవారి ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

News February 7, 2025

మంత్రులకు ర్యాంకులు.. వారికి అంబటి కంగ్రాట్స్

image

AP: ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన <<15380097>>ర్యాంకులపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్‌లకు అభినందనలు!’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు 10వ ర్యాంకు వచ్చిందని పలువురు కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా వీరిద్దరికే శుభాకాంక్షలు చెప్పడం వెనుక వ్యంగ్యం ఉందని పేర్కొంటున్నారు.

error: Content is protected !!