News February 6, 2025

బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్

image

బోయినపల్లి మండలంలోని వరద వెళ్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నారు. గుట్ట పైన ఎంతో ప్రకృతి అందాలతో బోటు ద్వారా వచ్చి దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నాగుల సాంబయ్య, భక్తులు ఉన్నారు.

Similar News

News April 2, 2026

VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఎస్‌బీఐ ఆర్‌సెటీ ద్వారా గ్రామీణ మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కరరావు తెలిపారు. ఈ నెల 6 నుంచి టైలరింగ్, ఎంబ్రాయిడరీ &ఫ్యాబ్రిక్ పెయింటింగ్, బ్యూటీ పార్లర్ మేనేజ్‌మెంట్, కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కోర్సులు నిర్వహిస్తామన్నారు. 18-50 ఏళ్ల వయస్సు గల మహిళలు 9959521662 నంబర్‌కు ఫోన్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. భోజనం,వసతి ఉచితమని, ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.

News April 2, 2026

కృష్ణా: బుక్ చేసిన 3- 8 రోజుల్లో సిలిండర్ల డెలివరీ: JC

image

LPG గ్యాస్ సిలెండర్ల ప్యానిక్ బుకింగ్స్ తగ్గడంతో జిల్లాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బుక్ చేసిన 3 నుంచి 8 రోజుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే DCO ఆఫీస్ నంబర్ 08672-252493, రాష్ట్ర హెల్ప్ లైన్ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News April 2, 2026

పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి: హరిత

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న 335 గ్రాపంచాయతీల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామసభలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, ఫ్రీ బస్సు, గ్యాస్ వంటి వాటి గురించి తెలపాలన్నారు.