News February 6, 2025

ఆర్థిక సహాయం అందజేసిన కలెక్టర్ సందీప్ కుమార్

image

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ కు SRCL కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా ఆర్థిక సాయం అందజేశారు. నేరెళ్ల గ్రామానికి చెందిన దాసరి రమేష్ లలిత దంపతుల పాప బుధవారం ప్రమాదవశాత్తు మరణించగా, బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద బుధవారం రాత్రి రూ.లక్ష అందజేశారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా గురువారం మరో లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

Similar News

News November 2, 2025

జనగామ: రుద్రమదేవి సొసైటీలో అక్రమాలు.. ఆరుగురి ఉద్యోగుల తొలగింపు

image

జనగామ జిల్లా కేంద్రంలోని రుద్రమదేవి మహిళా సహకార సొసైటీలో అక్రమాల బాగోతం బయటపడింది. భూమి కొనుగోలు పేరుతో సొసైటీ నిధుల్లో రూ.7.09 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఆరుగురు ఉద్యోగులను తొలగించాలని గత నెల 24న తీర్పు రావడంతో, సొసైటీ కార్యాలయానికి నోటీసులు అంటించారు.

News November 2, 2025

గొలగముడి: లడ్డూ కౌంటర్ 10 గంటలకు ముందే క్లోజ్

image

వెంకటాచలం మండలం గొలగముడి వెంకయ్య స్వామి గుడికి జిల్లాలోనే మంచి గుర్తింపు ఉంది. ఇక్కడకు ఒక్క శనివారమే సుమారు 10 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ భక్తులు ఎంతో భక్తితో తీసుకొనే లడ్డూ ప్రసాదం అందరికి అందడం లేదు. కనీసం రాత్రి 10 గంటలు కాకముందే కౌంటర్ మూసేశారు. దీంతో భక్తులు ప్రసాదం తీసుకోకుండానే నిరాశ చెందుతున్నారు. పలుమార్లు ఇలానే జరుగుతుందని భక్తులు వాపోతున్నారు.

News November 2, 2025

నాకు ప్రాణ భయం.. భద్రత పెంచండి: తేజ్ ప్రతాప్

image

బిహార్ ఎన్నికల వేళ లాలూ పెద్ద కుమారుడు, JJD చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ శత్రుత్వంతో తనపై హత్యాయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. తనకు ప్రాణభయం ఉందని, భద్రత మరింత పెంచాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. ఇటీవల దుండగుల కాల్పుల్లో జన్‌సురాజ్ కార్యకర్త మరణించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కుటుంబ విభేదాల నేపథ్యంలో తేజ్ ప్రతాప్‌ను RJD నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.