News February 7, 2025

ELR: అందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

image

ఏలూరు జిల్లాలో ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించనున్నారు. సంబంధిత వాల్ పోస్టర్లను డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం విడుదల చేశారు.DMHO ఆర్.మాలతి మాట్లాడుతూ.. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల లోపు ఉన్న వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని ఆదేశించారు. వీటిని తీసుకుంటే నులిపురుగులు రావని చెప్పారు.

Similar News

News November 5, 2025

విశాఖ డీసీపీ-1గా మణికంఠ చందోల్ బాధ్యతల స్వీకరణ

image

విశాఖ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో డీసీపీ-1గా మణికంఠ చందోల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీ కాగా తిరిగి ఆయనకే డీసీపీగా పోస్టింగ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆయనకు పలు కార్యక్రమాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడంలోనూ సఫలీకృతమైన అనుభవం, పరిపాలన పరంగా మంచి నైపుణ్యం ఉంది.

News November 5, 2025

వికారాబాద్: అనంతగిరిలో ఘనంగా కార్తీక దీపారాధన

image

అనంత పద్మనాభ స్వామి కటాక్షంతో సుభిక్షంగా వర్ధిల్లాలని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో భక్తులు స్వామివారికి పూజలు చేసి, కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో పూజలు చేస్తే, అన్ని విధాలుగా మంచి జరుగుతుందని భక్తుల అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

News November 5, 2025

జనాభా గణనకు సిద్ధం కావాలి: డైరెక్టర్ జె.నివాస్

image

భారతదేశ జనాభా గణన – 2027లో నమోదయ్యేందుకు ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర జన గణన డైరెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన భీమిలి మండలం ప్రజా పరిషత్, జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోనూ ఇండ్ల గణన పై PRE -TEST (ముందస్తు పరీక్ష) కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర జన గణన డైరెక్టర్ అధ్యక్షతన జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఎన్యూమ్ రేటర్లకు, సూపర్‌వైజర్లకు‌ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.