News February 7, 2025

పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం అవ్వండి: VKB కలెక్టర్

image

విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సన్నద్ధం కావాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు గట్టి నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరయ్యేలా సన్నద్ధం కావాలని సూచించారు.

Similar News

News February 27, 2026

UPSC అభ్యర్థులకు ట్యాబ్‌ల అందజేత

image

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.

News February 27, 2026

సునీల్ నాయక్ ఘటన.. బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం

image

బిహార్ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర క్యాడర్ పోలీసులపై చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల IPS సునీల్ నాయక్ ఘటనతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే <<19220184>>పట్నా కోర్టు<<>> IG స్థాయి అధికారిపై AP పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ వారెంట్/కేస్ డైరీ వెంట లేకుండా సునీల్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టింది.

News February 27, 2026

జగిత్యాల: మూడో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం.. 97.19% హాజరు

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలోని 30 పరీక్ష కేంద్రాల్లో జనరల్ కోర్సులకు 6,750 మందికి గాను 6,614 మంది హాజరుకాగా 136 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 1,142 మందికి 1,057 మంది పరీక్ష రాయగా 85 మంది గైర్హాజరయ్యారు. మొత్తం హాజరు శాతం 97.19గా నమోదైంది. జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత రాయికల్‌లోని పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.