News February 7, 2025

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ఠ చ‌ర్య‌లు: కలెక్టర్

image

ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు రెవెన్యూ అధికారులు ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టాలని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో భీమిలి డివిజ‌న్ రెవెన్యూ అధికారులతో కాన్ఫెరెన్స్‌లో సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. అన్యాక్రాంతానికి గురైన భూముల‌ను గుర్తించి త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Similar News

News March 8, 2026

విశాఖలో చేయి తడిపితేనే.. కొళాయి కనెక్షన్

image

విశాఖలోని నీటి కొళాయి కనెక్షన్‌ కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేసి, ఫీజులు చెల్లించినా మంజూరులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రూప్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌ల బల్క్ వాటర్ కనెక్షన్ల విషయంలో కింది స్థాయి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకుంటే ఫైళ్లు పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మీ పరిధిలో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News March 7, 2026

విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

image

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.

News March 7, 2026

విశాఖ: పన్నులు చెల్లించకుంటే జప్తే

image

ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా జీవీఎంసీ అధికారులు పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. రూ.650 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు మొండి బకాయిదారులపై చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 1,36,149 మంది బకాయిదారులను గుర్తించి, 1,10,136 మందికి జప్తు నోటీసులు జారీ చేశారు. నీటి పన్ను చెల్లించని 62,290 మందికి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం రూ.458.9 కోట్లు వసూలు కాగా, రూ.188.20 కోట్లు రావాల్సి ఉంది.