News February 7, 2025
SKLM: బందోబస్తు చర్యలు హర్షనీయం: ఎస్పీ

శ్రీకాకుళం పట్టణం అరసవల్లిలో శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు మూడు రోజుల పాటు కనుల పండువగా జరిగాయి. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు చర్యలు హర్షణీయమని కొనియాడారు.
Similar News
News March 22, 2026
మూలపేట పోర్ట్ సకాలంలో పూర్తయ్యేనా ?

టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్ట్ పనులు జాప్యంపై వైసీపీ పార్టీ సందర్శనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ పోర్ట్ ఎప్పటికీ పూర్తయ్యేను? అన్న చర్చ సాగుతుంది. 2023 ఏప్రిల్ 19న రూ.2,949.70 కోట్ల అంచనాతో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనులు ప్రారంభించారు. 2025 అక్టోబర్ 17న డెడ్ లైన్ నిర్ణయించారు. మళ్లీ 2026 నవంబరుకి పెంచారు. గడువులోగా పూర్తయ్యేనా అన్నది ప్రధాన చర్చ…!
News March 22, 2026
హిరమండలం: యువతిని ప్రేమించాడు.. కులం పేరుతో దూషించాడు.. జైలు

హిరమండలం మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతిని కులం పేరుతో దూషించినందుకు పోలాకి మండలానికి చెందిన దుర్గారావుకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై హేమంత్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన యువతిని ప్రేమ పేరుతో దుర్గారావు మోసం చేశాడు. పెళ్లి చేసుకోమని మహిళ అడగగా కులం పేరుతో దూషించాడని ఎస్ఐ చెప్పారు. దీనిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు.
News March 22, 2026
శ్రీకాకుళం: ‘మహిళల కోసం పింక్ టాయిలెట్స్’

శ్రీకాకుళం జిల్లాకు ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలోని డే అండ్ నైట్ కూడలి మార్గంలో ఉమెన్స్ కాలేజీ వద్ద మహిళల కోసం ఫీడింగ్ రూమ్, పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శంకర్ శనివారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..పలు ప్రాంతాల నుంచి శ్రీకాకుళానికి బస్సుల్లో పనులు నిమిత్తం వస్తున్న మహిళల ఇబ్బందుల దృష్ట్యా వీటిని ఏర్పాటు చేశామన్నారు.


