News March 19, 2024

హోం ఓటింగ్‌కు నోటిఫికేషన్ విడుదల

image

AP: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారు. పోలింగ్ తేదీకి 10 రోజుల ముందే ఇంటి నుంచి వారు ఓటు వేయవచ్చు. ఆ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు.

Similar News

News August 28, 2025

5 జిల్లాలకు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు

image

TG: రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(ఆరెంజ్ అలర్ట్), మిగతా జిల్లాల్లోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

News August 28, 2025

నేడు జపాన్‌ పర్యటనకు ప్రధాని మోదీ

image

ప్రధాని మోదీ ఇవాళ అర్ధరాత్రి జపాన్‌కు బయలుదేరనున్నారు. ఈనెల 29, 30 తేదీల్లో అక్కడ పర్యటించి 15వ ఇండియా-జపాన్ యాన్యువల్ సమ్మిట్‌లో పాల్గొంటారు. జపనీస్ PM ఇషిబాతో సమావేశమై ఇరు దేశాల దౌత్య, ట్రేడ్ సంబంధాలపై చర్చిస్తారు. 2018 తర్వాత మోదీ జపాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. 2014లో ఆయన PMగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు జపాన్‌లో పర్యటించారు.

News August 28, 2025

బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనున్న హీరోయిన్!

image

హీరోయిన్ నివేదా పేతురాజ్ పెళ్లి పీటలెక్కనున్నారు. బిజినెస్‌మెన్ రాజ్‌హిత్ ఇబ్రాన్‌ను ఆమె వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ జోడీ కలిసి దిగిన ఫొటోలను SMలో షేర్ చేశాయి. ఈ ఏడాదిలోనే అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు వెల్లడించాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని పేర్కొన్నాయి. నివేదా తెలుగులో మెంటల్ మదిలో, అల వైకుంఠపురంలో, పాగల్ తదితర చిత్రాల్లో నటించారు.