News February 7, 2025
ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్

ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న యాదయ్య దీర్ఘకాలిక సెలవు పెట్టడంతో ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ డీఈవోగా ఇమ్మాన్యుయల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 30, 2025
CETs తేదీలు ఖరారు.. చెక్ చేసుకోండి

తెలంగాణలో ఉన్నత విద్య కోర్సుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ డేట్స్ వెల్లడయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మా అనుబంధ కోర్సుల అడ్మిషన్లకు గల EAPCET 2026 మే 4- 11 తేదీల మధ్య ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇక MBA/MCA ప్రవేశాల కోసం ICETను మే 13, 14 తేదీల్లో B.Ed ఎంట్రన్స్ టెస్ట్ EDCETను మే 12న నిర్వహిస్తామని తెలిపింది. మిగతా పరీక్షల షెడ్యూల్, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు పై ఫొటోలో వివరంగా పొందండి.
Share It
News December 30, 2025
మోహన్లాల్ తల్లి కన్నుమూత

మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్ తల్లి శాంతాకుమారి(90) కన్నుమూశారు. కేరళలోని కొచ్చిలో ఆమె తుదిశ్వాస విడిచారు. శాంతాకుమారి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మోహన్లాల్కు సానుభూతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
News December 30, 2025
గరుడ గమన తవ విష్ణు స్తోత్రం రాసింది ఎవరో తెలుసా.?

ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయాలలో గరుడ గమన తవ.. చరణ కమల మిహా మనసిత సతు మల నిత్యం.. మహతాపము మా పా కురుదేవ.. మహా పాపమ మా పా కురుదేవ స్తోత్రం విస్తృతంగా వినపడుతుంది. ఈ మహా విష్ణు స్తోత్రాన్ని శృంగేరి శంకరమఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ భారతి తీర్థానంద స్వామి రచించారు. స్వామిజి పల్నాడు జిల్లాకు చెందినవారు. స్వామీజీ పల్నాడు జిల్లాలోనే విద్యాభ్యాసం చేశారు. ఇప్పటికీ నరసరావుపేటలో శృంగేరి శంకర మఠం ఉంది.


