News February 7, 2025
మంత్రులకు ర్యాంకులు.. వారికి అంబటి కంగ్రాట్స్

AP: ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా మంత్రులకు సీఎం చంద్రబాబు ఇచ్చిన <<15380097>>ర్యాంకులపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘మంత్రివర్గపు ర్యాంకులలో 8, 9 స్థానాలను సాధించిన లోకేశ్, పవన్లకు అభినందనలు!’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 10వ ర్యాంకు వచ్చిందని పలువురు కామెంట్స్ చేశారు. ప్రత్యేకంగా వీరిద్దరికే శుభాకాంక్షలు చెప్పడం వెనుక వ్యంగ్యం ఉందని పేర్కొంటున్నారు.
Similar News
News March 7, 2026
గుడ్న్యూస్.. వారికి వేతనాలు పెంపు!

AP: జలవనరుల శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోజు వారీగా ఇస్తున్న ₹350ని ₹550కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో లస్కర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు జీతం పెరిగింది. సాగునీటి కాలువలు, తూముల నుంచి నీటి విడుదల, షట్టర్ల మూత, నిర్వహణ, లీకేజీల గుర్తింపు, మరమ్మతు పనులు, పహారా వంటివి లస్కర్లు చూసుకుంటారు.
News March 7, 2026
ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పే: SBI రీసెర్చ్

పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇండియా గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ‘క్రూడాయిల్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి GDP వృద్ధి 0.25% వరకు తగ్గొచ్చు. హార్ముజ్ ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే దిగుమతి ఖర్చులు భారమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు, ట్రేడ్పై కూడా ప్రభావం ఉంటుంది. ఇది దేశ ఎకానమిక్ స్టెబిలిటీకి ఛాలెంజింగ్గా మారుతుంది’ అని హెచ్చరించింది.
News March 7, 2026
కల్తీ పాలు.. 10కి చేరిన మరణాలు

AP: రాజమండ్రి కల్తీ <<19289956>>పాల ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలైన ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్పై డయాలసిస్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.


