News February 7, 2025
కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలి: KMR కలెక్టర్
మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలిస్తున్నందున కామారెడ్డి జిల్లాలోని కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో పశుసంవర్ధక శాఖ సిబ్బందికి ఏవియన్ ఇన్ ఫ్లూయెంజాపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకి మహారాష్ట్ర సరిహద్దున ఉన్నందున కోళ్ల పెంపకం దారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News February 7, 2025
ఆరు సెక్టార్లుగా బందోబస్తు: SP కృష్ణారావు
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి తీర్థం జరిగే ప్రాంతాన్ని ఆరు సెక్టార్లుగా విభజించామని కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి విధుల కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలుజరగకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు ప్రసాద్, మురళీమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News February 7, 2025
నెల్లూరు: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తాతపై దాడి
నెల్లూరు రూరల్ బుజబుజ నెల్లూరులో విశ్రాంత సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి (68) నివాసం ఉంటున్నారు. ఆయన మనవడు అనిల్ సాయి తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణమూర్తిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న కుమారుడు రవికుమార్ వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News February 7, 2025
సూళ్లూరుపేట హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్
రోడ్డు ప్రమాదంలో ఐస్క్రీమ్లు విక్రయించే వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేటలో గురువారం రాత్రి జరిగింది. బాలాయపల్లి(మం), గొల్లగుంటకు చెందిన చల్లా వెంకటకృష్ణయ్య ఆటోలో ఐస్ క్రీమ్లు విక్రయించేవాడు. ఆయన ఐస్క్రీమ్ ఆటోలో సూళ్లూరుపేటకు వస్తుండగా ఆర్టీసీ డిపో సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.