News February 7, 2025
అవినీతి బ్రహ్మరాక్షసి లాంటిది: జస్టిస్ ఎన్వీ రమణ
నిజాయితీ కూడిన మేధావులు దేశానికి కావాలని మాజీ CJI జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ప్రస్తుతం వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా మారి వారితో అవినీతి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవినీతి బ్రహ్మ రాక్షసి లాంటిదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రజలు వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతున్నారన్నారు. పిల్లలకూ రాజకీయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
Similar News
News February 7, 2025
ఈ నెల 14న రాష్ట్ర బంద్: మాల మహానాడు
TG: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇందుకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ప్రకటించాయి. మాలలను అణచివేసేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, MRPS నేత మందకృష్ణ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డాయి.
News February 7, 2025
విద్యుత్ డిమాండ్.. తెలంగాణ చరిత్రలోనే అత్యధికం
TG: రాష్ట్ర రోజువారీ విద్యుత్ డిమాండ్ విషయంలో సరికొత్త రికార్డు నమోదైంది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా గురువారం(FEB 6) 15,752 మెగావాట్లుగా నమోదైనట్లు ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్ తెలిపారు. 2024 మార్చి 8న రోజువారీ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు నమోదుకాగా ఈసారి ఫిబ్రవరిలోనే అది బ్రేకయ్యింది. ఎండల నేపథ్యంలో రబీ సాగు, ఇళ్లు, పరిశ్రమల్లో కరెంటు వినియోగం పెరగడమే దీనికి కారణం.
News February 7, 2025
TCS ఉద్యోగులకు షాక్.. వేరియబుల్ పేలో భారీ కోత
ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ సీనియర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 2024-25 Q3లో వారి వేరియబుల్ పేలో భారీ కోత పెట్టినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆఫీసుకు వచ్చి పనిచేస్తున్నప్పటికీ వరుసగా రెండో క్వార్టర్లోనూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తొలి త్రైమాసికంలో 70 శాతం వేరియబుల్ పే అలవెన్స్ ఇవ్వగా, Q2లో 20-40 శాతానికి పరిమితం చేసింది. తనకు 50K-55K రావాల్సి ఉండగా Q2లో సగం, Q3లో ఇంకా తగ్గిందని ఓ ఉద్యోగి చెప్పారు.