News February 7, 2025
NGKL: చెరువులో పడి మహిళ మృతి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 5, 2025
ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా?: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి <<16942338>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘మీ PayCM అందరినీ బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరా గాంధీ గొప్పతనం అర్థం కాదంటున్నాడు. ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా రాహుల్ గాంధీ? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఏంగా మార్చినప్పటి నుంచి ఆయన ఏది పడితే అది మాట్లాడటాన్ని అనుమతిస్తున్న మీ విధానాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.
News July 5, 2025
ఆదిలాబాద్: ఆత్మహత్య పరిష్కారం కాదు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారు సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం చిన్నదైన, పెద్దదైన ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. బజార్హత్నూర్కు చెందిన తరుణ్, లోకేశ్వరం వాసి దేవన్న, లింగాపూర్కు చెందిన సరసత్వీ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
News July 5, 2025
ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్గా కళ్యాణి

ములుగు జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్మన్ను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ మహిళ జిల్లా అధ్యక్షురాలుగా పని చేస్తున్న తాడ్వాయి మండలం కామారం పీటీ గ్రామానికి చెందిన కళ్యాణిని నియమించింది. నూతన మార్కెట్ కమిటీ ఛైర్మన్గా నియమితులైన కళ్యాణికి జిల్లా, మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.