News February 7, 2025
ఏలూరు ఆర్ఐవోగా యోహన్

ఏలూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి(ఆర్ఐవో)గా కె.యోహన్ నియమితులయ్యారు. ఏలూరు కోట దెబ్బ ప్రాంతంలోని కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు తీసుకున్నారు. తర్వాత కలెక్టర్ వెట్రి సెల్విని కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆగిరిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఏలూరు జిల్లా ఆర్ఐఓవోగా నియమితులయ్యారు.
Similar News
News January 11, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: SP

సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడి పందాలు, గుండాట తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని SP నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. కోడిపందేలు, జూదం జరిగే అవకాశమున్న అనుమానిత ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంటుందన్నారు. వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. కోడి పందేల నిర్వహణకు తోటలు, స్థలాలు ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
తప్పవన్నారు.
News January 11, 2026
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈనెల 12న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ నారాయణ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News January 11, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.


