News February 7, 2025
గ్రూప్-1 ఫలితాలపై UPDATE
TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. మరో 10 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు TGPSC కసరత్తు చేస్తోంది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా ఉండనుంది. ఈ పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2, 3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. బ్యాక్లాగ్లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.
Similar News
News February 7, 2025
కోహ్లీ ఆడితే జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారు?
మోకాలి గాయంతో ఇంగ్లండ్తో తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడతారని సపోర్ట్ స్టాఫ్ తెలిపింది. అయితే ఆయన తుది జట్టులోకి వస్తే తొలి వన్డే ఆడిన ప్లేయర్లలో ఎవరిని పక్కనపెడతారనేది ఆసక్తికరంగా మారింది. కోహ్లీ స్థానంలో ఆడిన శ్రేయస్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న నేపథ్యంలో అతడిని పక్కనపెట్టే అవకాశం కనిపించడం లేదు. జైస్వాల్ను తప్పించి గిల్ను ఓపెనింగ్, కోహ్లీని వన్ డౌన్లో ఆడించే ఛాన్సుంది.
News February 7, 2025
అంబటి రాంబాబుకు టీడీపీ నేత కౌంటర్
AP: రాష్ట్రంలో ‘ర్యాంకు’ రాజకీయం నడుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో ‘8, 9 స్థానాలు వచ్చిన లోకేశ్, పవన్కు అభినందనలు’ అంటూ <<15384201>>అంబటి రాంబాబు<<>> చేసిన ట్వీట్కు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘అయ్యా అంబటి 8, 9 స్థానాల్లో వచ్చిన వారిద్దరూ 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానంలోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు’ అని సెటైర్ వేశారు.
News February 7, 2025
బీసీలకు 42శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: పొన్నం
TG: ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కులగణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. BRS నేతలు సర్వేలో పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.