News February 7, 2025

పీఎం స్కూల్ కింద 30 పాఠశాలలు ఎంపిక: VKB కలెక్టర్

image

జిల్లాలో ప్రధాన మంత్రి స్కూల్స్ పర్ రైసింగ్ ఇండియా స్కీం కింద 30 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపికైన పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

Similar News

News February 7, 2025

ఆ కామెంట్స్ నేను పట్టించుకోను: హర్షిత్ రాణా

image

ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను దించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై రాణా స్పందించారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు. అవేవీ నేను పట్టించుకోదలచుకోలేదు. నా ఆటపైనే తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టను’ అన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన తర్వాతే తాను అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దానికి ముందుగానే సిద్ధమై ఉన్నానని తెలిపారు.

News February 7, 2025

ట్యాక్స్ బెన్ఫిట్స్‌తో ఇలా చేయండి: డా.ముఖర్జీ

image

కేంద్రం ట్యాక్స్ భారాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు డాక్టర్ ముఖర్జీ చిన్న సలహా ఇచ్చారు. ‘ట్యాక్స్ బెన్ఫిట్స్‌ వల్ల మిగిలిన అదనపు డబ్బును హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా పెట్టడం మంచి మార్గం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆస్పత్రి ఖర్చులు భరించడం కష్టం. సేవింగ్స్ మొత్తం ఖర్చవకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు చెప్పిరావు కాబట్టి ఏళ్ల తరబడి ఆదా చేసిన డబ్బు రోజుల్లో ఖాళీ అవుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.

News February 7, 2025

కడప: విచారణ అధికారి ఎదుట హాజరైన దస్తగిరి

image

తనని జైలు సూపరింటెండెంట్ ప్రకాశ్ ఇబ్బంది పెట్టారని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కడప జైలులో ఇవాళ విచారణ అధికారి రాహుల్ శ్రీరాం ఎదుట దస్తగిరి హాజరయ్యారు. ఫిర్యాదులో డాక్టర్ చైతన్య రెడ్డి తనని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. దస్తగిరి తర్వాత చైతన్య, ప్రకాశ్ విచారణకు హాజరుకానున్నారు.

error: Content is protected !!