News February 7, 2025
శ్రీకాకుళం: రహదారి విస్తరణకు రూ.107 కోట్లు మంజూరు

సుదీర్ఘ ప్రాంత గ్రామాలకు అనుసంధానంగా ఉన్న డీపీఎన్ రహదారి విస్తరణ, తారు రోడ్డు నిర్మాణం పనులకు ఎన్డీఏ ప్రభుత్వం రూ.107 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు గురువారం తెలిపారు. పోలాకి మండలం, డోల గ్రామాల నుంచి సంతబొమ్మాళి మండలం నౌపడ వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. టీడీపీ నాయకులు మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 5, 2025
శ్రీకాకుళం: మీలో ప్రతిభకు ఈ పోటీలు

యువజన సర్వీసుల శాఖ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో (జానపద బృంద నృత్యం, గీతాలు), స్టోరీ రైటింగ్, కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్ పోటీలను NOV 11న నిర్వహించనున్నారు. ఆ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పలనాయుడు ప్రకటనలో తెలిపారు. 15-29 ఏళ్లు ఉన్న యువతీ, యువకులు అర్హులని, శ్రీకాకుళం(M)మునసబపేటలోని గురజాడ ఆడిటోరియంలో పోటీలు జరుగుతాయన్నారు. వివరాలకు పని వేళల్లో ఈనం:97041 14705ను సంప్రదించాలన్నారు.
News November 5, 2025
నేడు శ్రీకాకుళం జిల్లా సమీక్ష సమావేశం: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లా సమీక్షా సమావేశం బుధవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ప్రవాస భారతీయుల సాధికారత సంబంధాల శాఖ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతుందన్నారు. అజెండాలోని అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించనున్నట్లు వివరించారు.
News November 4, 2025
ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్లు ఇన్స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.


