News February 7, 2025
కాళేశ్వరంలో నేటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను అర్చకులు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం మేళతాళాలు, వేద మంత్రాలతో వేద పండితులతో కలిసి త్రివేణి సంగమం వద్దకు వెళ్లి ఐదు కలశాలతో పవిత్ర గోదావరి జలాలను ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం మంగళవాయిద్యాలతో వేద స్వస్తివాచకములు, గణపతి పూజ, గోపూజ ప్రారంభమవుతాయి. తదుపరి ఉచిత పులిహోర ప్రసాదం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.
Similar News
News February 7, 2025
గజ్వేల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల విలీనం
మల్లన్న సాగర్ ముంపుకు గురైన 7 గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైనట్లే అని డీపీవో జానకీదేవి తెలిపారు. తొగుట మండలంలోని 5, కొండపాక మండలంలోని 2 గ్రామాలు ముంపునకు గురి కాగా గజ్వేల్ పరిధిలో ఆర్అండ్ ఆర్ కాలనీని నిర్మించి 4ఏళ్ల క్రితం నిర్వాసితులను తరలించారు. ఈ 7గ్రామాల పరిధిలో 15 వేల జనాభా ఉండగా, ఏడు వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. తాజాగా గజ్వేల్ గ్రేడ్ మారడంతోపాటు వార్డుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.
News February 7, 2025
శ్రీరంగాపూర్: విద్యుత్ షాక్తో యువతి మృతి
శ్రీరంగాపూర్ అంబేడ్కర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన మౌనిక (20) ఉదయం ఇంటి వద్ద బట్టలు ఉతుకుతూ.. తడిచేతులతో మోటార్ ప్లగ్ను తీసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో షాక్ తగిలి స్పాట్లో మరణించిదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే JLM ఉద్యోగం వచ్చిందని విధుల్లో చేరవలసి ఉందని పేర్కొన్నారు.
News February 7, 2025
పలు సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గురువారం పార్లమెంట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో కొన్ని సమస్యలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్కు వివరించారు. జిల్లాలో గుడివాడలో కేటీఆర్ కళాశాల, గిలకలదిండి, మెడికల్ కళాశాల, బందర్లోని చిలకలపూడి, పెడన్ మెయిన్ రోడ్, ఉప్పులూరు, గూడవల్లి, నిడమానూరు, గుడ్లవల్లేరు, రామవరప్పాడు వద్ద ROB, RUBలను నిర్మించి ట్రాఫిక్కు చెక్ పెట్టాలని కేంద్రమంత్రిని కోరారు.