News February 7, 2025

రేపటి నుంచి TG ఓపెన్ చెస్ టోర్నీ

image

TG: రేపు, ఎల్లుండి చర్లపల్లిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేట్ చెస్ అసోసియేషన్ (TSTA) తెలిపింది. బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయని TSTA ప్రెసిడెంట్ KS ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని, వివరాలకు 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 7, 2025

సెలవు ఇవ్వలేదని…

image

ఆఫీస్‌లో సెలవు ఇవ్వలేదని నలుగురు సహోద్యోగులను పొడిచిన ఘటన బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. అమిత్ కుమార్ సర్కార్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. నిన్న అతడు లీవ్ కోసం అప్లై చేయగా రిజెక్ట్ అయింది. ఈ విషయంపైనే తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగిన అతడు కత్తితో నలుగురిపై దాడి చేశాడు. అనంతరం కత్తి, రక్తం మరకలతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 7, 2025

ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!

image

మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.

News February 7, 2025

టాటా ఆస్తిలో రూ.500 కోట్లు.. ఎవరీ మోహన్ దత్తా?

image

వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో రూ.500 కోట్లు మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి రాశారు. ఆ పేరు తాజాగా బయటికి రావడంతో ఆయన ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన దత్తా ఒకప్పుడు స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీకి యజమాని. దాన్ని టాటా గ్రూప్‌లో కలిపేశారు. టాటాతో మోహన్‌కు 60 ఏళ్ల స్నేహముందని జంషెడ్‌పూర్‌వాసులు చెబుతుంటారు. ఆ స్నేహంతోనే భారీ మొత్తాన్ని ఇచ్చారని తెలుస్తోంది.

error: Content is protected !!