News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్నగర్లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News April 2, 2026
MHBD జిల్లాలో పల్లెపల్లెనా హెల్మెట్ హోరు!

MHBD జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా పోలీస్ యంత్రాంగం సరికొత్తగా ‘హెల్మెట్ ధారణ’ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణాలతో పాటు పల్లెపల్లెనా వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి చౌరస్తాలో అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, హెల్మెట్ ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ప్రాణ రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న ఈ సరికొత్త చొరవను జిల్లా ప్రజలు హర్షిస్తున్నారు.
News April 2, 2026
జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

AP: అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదని, అందుకే వింత పేరు తీసుకొచ్చారని CM CBN విమర్శించారు. మావిగన్ పేరు పెట్టాలనడం ద్వేషానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. అమరావతిపై ఆయన వైఖరి మారదని స్పష్టమైందని కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో అన్నారు. రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రానికి ప్రతిఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని, తాను మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో సంబరాల్లో పాల్గొంటానని చెప్పారు.
News April 2, 2026
అమరావతి శంకుస్థాపన ప్రదేశానికి నేడు సీఎం రాక

అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉద్దండరాయునిపాలెంలో 2015 అక్టోబర్ 22న ప్రధాన మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం రానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు అమరావతి ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు ఉద్దండరాయపాలెం శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటున్నారు.


