News February 7, 2025
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి పసిపాప మృతి

స్కూల్ బస్సు కింద పడి బాలిక మృతి చెందిన ఘనట హయత్నగర్లో జరిగింది. స్థానికుల ప్రకారం.. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్దఅంబర్పేటలో ఉంటున్నారు. ఆయన కుమార్తె రిత్విక హయత్నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో LKG చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయిందని వాపోయారు.
Similar News
News March 25, 2026
అన్ని కాలేజీల్లో ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు

AP: కాలేజీకి రాకుండానే హాజరును మేనేజ్ చేద్దామనుకుంటే ఇక కుదరదు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు, లెక్చరర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేయాలని GOVT నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్తో పాటు ప్రైవేటు కాలేజీలకూ వచ్చే ఏడాది నుంచి ఇది వర్తించనుంది. రియల్ టైమ్ పర్యవేక్షణతో హాజరు శాతాన్ని పెంచడం ద్వారా ప్రమాణాలు మెరుగుపర్చనుంది. 75% హాజరుంటేనే విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది.
News March 25, 2026
మెంటాడ మళ్లీ గజపతినగరంలో కలిసేనా?

నియోజకవర్గాల పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో మెంటాడ ప్రజలు తమ మండలాన్ని సాలూరు నుంచి వేరు చేయాలని కోరుతున్నారు. సాలూరు మన్యం జిల్లాలో ఉండగా.. మెంటాడ విజయనగరంలో కొనసాగుతుండడంతో పరిపాలన, అభివృద్ధి పరంగా వెనుక పడుతున్నామని స్థానికుల అభిప్రాయం. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తాజా నిర్ణయంతో మెంటాడను మళ్లీ గజపతినగరంలో కలపాలని వారు కోరుతున్నారు.
News March 25, 2026
రాహుల్ పర్యటన రద్దు.. కేరళంకు రేవంత్

కడుపు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాహుల్ గాంధీ అక్కడే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన కేరళం టూర్ రద్దయింది. రాహుల్కు బదులుగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు TG CM రేవంత్ కేరళంకు బయల్దేరారు.


