News February 7, 2025
MLC ఎన్నికల బరిలో నలుగురు జన్నారం వాసులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జన్నారం మండలానికి చెందిన నలుగురు నిలిచారు. మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, చింతగూడకు చెందిన మేకల అక్షయ్ కుమార్, దేవుని గూడెం గ్రామానికి చెందిన గవ్వల శ్రీకాంత్, ఆయన భార్య గవ్వల లక్ష్మి శ్రీకాంత్ ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మండలానికి చెందిన మరి కొంతమంది ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసే అవకాశముంది.
Similar News
News March 14, 2026
గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.
News March 14, 2026
WGL: కార్యదర్శులకు డబుల్ ఒత్తిడి!

గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరోవైపు పడింది. సర్వేలు, సమావేశాలు, నివేదికలతో పని భారం పెరిగి పన్నుల వసూళ్లు చేయడం కష్టమవుతోందని ఉమ్మడి జిల్లా కార్యదర్శులు వాపోతున్నారు.
News March 14, 2026
రాజమండ్రి: ఆగని మరణాలు.. మరో ఇద్దరు మృతి

రాజమండ్రిలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. కిమ్స్ బుల్లినేని ఆసుపత్రిలో కడలి కృష్ణారావు (75), డెల్టా ఆసుపత్రిలో రెడ్డి అనంతలక్ష్మి (55) మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.


