News March 19, 2024

HYD: ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగింది: కిషన్ రెడ్డి

image

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరుతో దేశ ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం HYD బర్కత్‌పురలోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో డాక్టర్ కేఎస్ సోమశేఖర్ రావుకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించారు. మోదీ పాలనలో అభివృద్ధిని కొనసాగించేందుకు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News April 10, 2025

చిక్కడపల్లి: విజయయాత్ర మార్గాన్ని పరిశీలించిన సీపీ

image

హనుమాన్‌ జయంతి సందర్భంగా నిర్వహించే ‘వీర హనుమాన్‌ విజయ యాత్ర’ రూట్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. గౌలిగూడ రామమందిరం నుంచి నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు చౌరస్తా, అశోక్‌నగర్, కవాడిగూడ, బైబిల్‌ హౌస్‌, తాడ్‌‌బండ్‌ హనుమాన్‌ టెంపుల్‌ వరకు దాదాపు 12.2 కిలోమీటర్లు శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌మాన్, ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జోయల్‌ డేవిస్ ఉన్నారు.

News April 10, 2025

HYD: చికెన్, మటన్ షాపులు బంద్

image

గ్రేటర్‌ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT

News April 10, 2025

HYD: నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

image

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్‌ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.

error: Content is protected !!