News February 7, 2025

UPDATE: గజ్వేల్ మృతులు గోదావరిఖని వాసులు

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహాదారిపై జరిగిన <<15384831>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. గోదావరిఖనికి చెందిన బాణేశ్(28), లింగం(48) మృతిచెందారు. మహేశ్(44) పరిస్థితి విషమంగా ఉండడంతో గజ్వేల్ వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Similar News

News October 25, 2025

ఖమ్మం: DCC ఎవరికి దక్కేనో..!

image

ఖమ్మం, కొత్తగూడెం డీసీసీలు నేడు ఖరారు కానున్నారు. జిల్లా అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. ఖమ్మం డీసీసీ పీఠానికి 51 మంది అప్లై చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 50కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ పరిశీలకులు మహేంద్రన్, జాన్సన్ జిల్లా అగ్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుని అధిష్ఠానానికి నివేదించారు. మరి పదవి ఎవరికి దక్కుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

News October 25, 2025

సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

image

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్‌-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్‌ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్‌స్క్రీన్‌లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.

News October 25, 2025

వచ్చే నెల నుంచి అందుబాటులోకి ‘భారత్ టాక్సీ’

image

ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా కేంద్రం ‘భారత్ టాక్సీ’ని తీసుకురానుంది. వచ్చే నెల నుంచి ఢిల్లీలో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో దీనికి 25% చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెలవారీ నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఢిల్లీలో విజయవంతమైతే డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.