News February 7, 2025
నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు
నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
Similar News
News February 7, 2025
విశాఖ: ఎమ్మెల్సీ స్థానానికి మరో మూడు నామినేషన్లు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. వారిలో నూకల సూర్యప్రకాష్, రాయల సత్యనారాయణ, గాదె శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి.
News February 7, 2025
PPM: మన్యం జిల్లా ఆశావాహ జిల్లాల్లో అగ్రస్థానంలో ఉండాలి
పార్వతీపురం మన్యం దేశంలోని ఆశావాహ జిల్లాల్లో అగ్రగామిగా నిలపాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆశావాహ జిల్లాల విభాగంలో పార్వతీపురానికి ప్రధానమంత్రి అవార్డు రావాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది భామిని బ్లాక్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇదే స్ఫూర్తిని బ్లాక్తో పాటు జిల్లాలోనూ కొనసాగించాలన్నారు.
News February 7, 2025
సంగారెడ్డి: పది విద్యార్థులకు అల్పాహారం నిధులు విడుదల
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం నిధులు విడుదల చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున రోజు సాయంత్రం అల్పాహారం అందించేందుకు విద్యార్థికి రూ.15 చొప్పున జిల్లాలో 7,757 మంది విద్యార్థులకు 38 రోజులకు గాను రూ.44,21,490 ను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.