News February 7, 2025
ASF: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 25, 2026
మంచిర్యాల వరకే భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు

సికింద్రాబాద్ – కాగజ్ నగర్ మధ్య నడిచే (17233/34) భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఈనెల 27 నుంచి ఫిబ్రవరి 13 వరకు మంచిర్యాల వరకు మాత్రమే నడుస్తుంది. సికింద్రాబాద్ – కాగజ్ నగర్ మధ్య నడిచే (17011/12) ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు మంచిర్యాల వరకు మాత్రమే నడుస్తోందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు గమనించాలని వారు కోరారు.
News January 25, 2026
చిన్నారుల పోర్న్ వీడియోలు చూస్తున్నారంటూ..

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. ‘మీరు చిన్నారుల పోర్న్ వీడియోలు చూశారని కంప్లైంట్ వచ్చింది. మీ ఫోన్ నంబర్, IP అడ్రస్ మా వద్ద ఉంది. మేం అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కేసు ఫైల్ చేస్తాం’ అని దేశవ్యాప్తంగా వేల మందికి ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం. అందులోని కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, కస్టమ్స్ ఆఫీసర్ల పేర్లు, కేసు సెక్షన్లు చూసి మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
News January 25, 2026
గణతంత్ర చరిత్రలో గుంటూరు ఘనకీర్తి

భారత గణతంత్ర చరిత్రలో గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. 1950లో జరిగిన తొలి గణతంత్ర వేడుకలకు పునాది వేసిన రాజ్యాంగ సభలో జిల్లాకు చెందిన దేశభక్త కొండా వెంకటప్పయ్య, ఎన్.జి.రంగా వంటి మహనీయులు కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి గుంటూరు కంచుకోటగా నిలిచింది. ఆనాటి స్ఫూర్తిని కొనసాగిస్తూ, నేడు 77వ గణతంత్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతిలో జరగనుండటం విశేషం.


