News February 7, 2025
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కూటమి: ధర్మశ్రీ

వాల్తేర్ డివిజన్ ను విచ్చన్నం చేసి ఒడిశాకు పెద్దపీట వేసారని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ విమర్శించారు. అనకాపల్లిలో గురువారం మాట్లాడుతూ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. అనకాపల్లి, విశాఖ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
Similar News
News March 6, 2026
నేటి నుంచి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’

TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ నేడు ప్రారంభంకానుంది. జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రొగ్రామ్ ఉంటుంది. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, యువత, నైపుణ్యాలు వంటి అంశాలపై విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక ఈరోజు నుంచి 15వ తేదీ వరకు పరిసరాల శుభ్రత, పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ పరిష్కారంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.
News March 6, 2026
ఖమ్మం జిల్లాలో 10 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ

ఖమ్మం జిల్లాలో 10 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తూ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 317జీవో ప్రకారం ఇంటర్ లోకల్ కేడర్లో భాగంగా వీరిని మంచిర్యాల, ఆదిలాబాద్, కరీంనగర్ వంటి ఇతర జిల్లాలకు కేటాయించారు. నేలకొండపల్లి, పెనుబల్లి, తిరుమలాయపాలెం తదితర మండలాలకు చెందిన కార్యదర్శులు ఈ బదిలీ అయిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరంతా తక్షణమే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
News March 6, 2026
అనంతపురం జిల్లాపై YS జగన్ ఫోకస్

అనంతపురం జిల్లాలో పార్టీ బలోపేతానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. గుంతకల్లు-లింగాల శివశంకర్ రెడ్డి, రాయదుర్గం-బత్తల హరి ప్రసాద్, తాడిపత్రి-అత్తార్ చాంద్బాషా, కళ్యాణదుర్గం-ఎం.మహేంద్రనాథ్ రెడ్డి, ఉరవకొండ-కే.రమేశ్ రెడ్డి, శింగనమల-ఎల్ఎం మోహన్ రెడ్డి, అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిశీలకుడిగా బోయ తిప్పేస్వామి నియమితులయ్యారు.


