News February 7, 2025

నేడు వడ్డీ రేట్లు ప్రకటించనున్న ఆర్బీఐ

image

ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాల్ని కాసేపట్లో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించనున్నారు. కీలక రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెషన్ ఆరంభ సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 87.80 పాయింట్లు పెరిగి 78,145.96 వద్ద ఉంది. నిఫ్టీ 35.05 పాయింట్లు లాభపడి 23,638 వద్ద ట్రేడయింది.

Similar News

News November 11, 2025

ఒక్కో కుటుంబానికి రూ.3వేలు

image

AP: తిరుపతి (D) కేవీబీపురం(M) ఒల్లూరులోని రాయలచెరువుకు గండి పడటంతో నీటమునిగిన కళత్తూరు ఎస్సీ కాలనీ, SL పురం, పాతపాలెం ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 960 కుటుంబాలను ఆదుకునేందుకు రూ.3.24కోట్లు మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.3వేలు, 25కిలోల బియ్యం తదితర నిత్యావసరాలు అందించనున్నారు. అలాగే వరదలో చనిపోయిన 1,100 పశువులకు CM రిలీఫ్ ఫండ్ నుంచి రూ.83.50లక్షల పరిహారం ఇవ్వనున్నారు.

News November 11, 2025

చక్కటి కురులకు చక్కెర స్నానం

image

చక్కెరను వంటకాల్లో ఎక్కువగా వాడతారు. మరికొందరు చర్మ సౌందర్యం కోసం స్కిన్‌పై కూడా అప్లై చేస్తారు. అయితే, చక్కెర జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది.
షాంపూలో టీ స్పూన్ పంచదార వేసి ఈ మిశ్రమంతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చక్కెరతో తలస్నానం చేయడం వల్ల తలలో పేరుకుపోయిన మురికి పోతుంది. అలాగే జుట్టురాలడం, చుండ్రు, జుట్టు చిట్లడం, తలలో దురద వంటి సమస్యలు తగ్గుతాయి.

News November 11, 2025

ఏపీ అప్డేట్స్

image

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ