News February 7, 2025
కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
Similar News
News March 7, 2026
చిరంజీవికి తెలంగాణ గద్దర్ అవార్డు-2025

☞ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు- చిరంజీవి
☞ పైడి జయరాజ్ అవార్డు- కమల్హాసన్
☞ సినారె అవార్డు- సుద్దాల అశోక్ తేజ
☞ అక్కినేని నాగేశ్వరరావు అవార్డు-జయసుధ
☞ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు-అశ్వనీదత్
☞ రఘుపతి వెంకయ్య అవార్డు-రమేశ్ ప్రసాద్
☞ కాంతారావు అవార్డు- ఆర్.నారాయణమూర్తి
☞ బీఎన్ రెడ్డి అవార్డ్- సింగీతం శ్రీనివాస్
News March 7, 2026
అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ను శనివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో వడ్డించే అల్పాహారం నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా మెలగాలని సిబ్బందికి సూచించారు. అక్కడ అందుతున్న సేవలపై నేరుగా ప్రజలను అడిగి ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
News March 7, 2026
ఇవాళ భారీగా లొంగిపోనున్న మావోలు.. గణపతి ఉంటారా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం నిర్వహించే ప్రెస్మీట్లో 124 మంది ఆయుధాలతో సహా సరెండర్ కానున్నారు. కేంద్ర బలగాలు, పోలీసులు ఎప్పటి నుంచో వెతుకుతున్న మావో టాప్ కమాండర్ గణపతి వీరిలో ఉంటారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల సరెండర్ అయిన దేవ్జీ సహా కీలక నేతల గన్మెన్లు, అనుచరులు లొంగిపోనున్నారు.


