News February 7, 2025
మంత్రి సంధ్యారాణికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

మొదటిసారి MLAగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి చంద్రబాబు క్యాబినేట్లో మహిళా& శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20 ర్యాంక్ ఇవ్వగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి 3వ ర్యాంక్ సాధించారు. మరి సంధ్యారాణి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?
Similar News
News March 21, 2026
IPLలో గ్రేటెస్ట్ టీమ్ ఇదే: పఠాన్

IPLలో ముంబై ఇండియన్స్ గ్రేటెస్ట్ టీమ్ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ముంబై, చెన్నైలలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలంటే కష్టమే. చెన్నై 2010లో, ముంబై 2013లో తొలిసారి టైటిల్స్ సాధించాయి. ఇరు జట్లు 5 సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. కానీ టీమ్ ఇండియాకు మ్యాచ్ విన్నర్లను అందించడంలో ముంబై ముందు వరుసలో ఉంది. అందులో నలుగురు టీమ్ ఇండియా కెప్టెన్లు ఉన్నారు. అందుకే ముంబై అంటే నాకు గౌరవం’ అని తెలిపారు.
News March 21, 2026
అనంతపురంలో బీజేపీ ‘SIR’ జిల్లా సన్నాహక సమావేశం

అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం SIRపై సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రాజేశ్ కురుబ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా రాష్ట్ర మీడియా ప్రతినిధి మధుసూదన్, కార్యదర్శి శ్రీనివాసులు, చిరంజీవి రెడ్డి హజరయ్యారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీదేవి పాల్గొన్నారు.
News March 21, 2026
రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి: మెదక్ కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన రైతు ఉత్సవాల’ కార్యక్రమంలో మెదక్ జిల్లా రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఆదివారం నర్మెటలో జరిగే ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి 2,650 మంది రైతులను తరలించేందుకు 53 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


