News February 7, 2025

KMR: ఈనెల 10న జిల్లా స్థాయి ట్రయథ్లాన్ సెలక్షన్స్

image

కామారెడ్డి జిల్లా స్థాయి యూత్ ట్రయథ్లాన్ సెలక్షన్స్ ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనిల్ కుమార్ శుక్రవారం తెలిపారు. అండర్ 20, 18, 16, 14 విభాగాల్లో.. వివిధ అంశాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్‌తో జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.

Similar News

News February 7, 2025

కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు రంగ రంగ వైభవంగా ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. కాళేశ్వర దేవస్థానంలో శుక్రవారం జిల్లా కలెక్టర్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యటించారు. ఈనెల 9న మహా కుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని రద్దీకి తగినట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News February 7, 2025

దారుణం.. రైల్లోంచి గర్భిణిని నెట్టేసిన దుండగుడు

image

తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 7, 2025

మహాకుంభమేళా @40 కోట్ల మంది భక్తులు

image

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేటి వరకు 40 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇవాళ కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

error: Content is protected !!