News February 7, 2025

MHBD: మిర్చి రైతుకు మిగిలిన కన్నీళ్లు..!

image

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట వేయడానికి రైతులు మక్కువ చూపుతారు. ఎంతో కష్టపడి పండించిన మిర్చి పంటకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర రాక రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత సంవత్సరం గరిష్ఠంగా క్వింటా రూ.20- 23 వేల మధ్య ఉన్న ధర, ప్రస్తుతం రూ.12-14 వేలు చెల్లిస్తున్నారు. అయితే తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గుతూ, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు మనోవేదనకు గురవుతున్నారు.

Similar News

News March 21, 2026

బడ్జెట్‌లో మైక్రో SUV.. సరికొత్తగా ఎక్స్‌‌టర్

image

మధ్యతరగతి ఫ్యామిలీలే టార్గెట్‌గా మార్కెట్లోకి హ్యుందాయ్ సరికొత్త ఎక్స్‌టర్‌ను తీసుకొచ్చింది. ఈ మైక్రో SUV ప్రారంభ ధరను రూ.5,79,000(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. పాత మోడల్‌తో పోలిస్తే కాస్త డిజైన్ ఛేంజెస్ చేసింది. తొలిసారి డ్యాష్‌క్యామ్ ఫీచర్ తీసుకొచ్చింది. స్పోర్టీ డీ-కట్ స్టీరింగ్ వీల్, లాంగ్ వీల్‌బేస్, 4 సిలిండర్ 1.2 కప్పా పెట్రోల్ ఇంజిన్‌ సహా 25రకాల మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.

News March 21, 2026

నిర్మల్: విద్యార్థిని తేజస్విని మృతి.. కారణం ఇదే

image

బాసర RGUKT విద్యార్థిని తేజస్విని మృతికి ‘అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్’ (బ్లడ్ క్యాన్సర్ – 4వ స్టేజి) కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు నిజామాబాద్, గాంధీ ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. అయితే అప్పటికే క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో ఆమె మృతి చెందినట్లు వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వర్సిటీ అధికారులు విచారం వ్యక్తం చేశారు.

News March 21, 2026

జనగామ: కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్.. చిగురిస్తున్న ఆశలు!

image

గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగేళ్లుగా పింఛన్లు రాక నానా అవస్థలు పడ్డారు. జిల్లా ఉన్నతాధికారులకు పలుమార్లు ఇప్పించండి మహాప్రభో అని ప్రజావాణిలో వేడుకున్నారు. ఎట్టకేలకు శుక్రవారం శాసనసభలో భట్టి విక్రమార్క కొత్త పింఛన్లకు బడ్జెట్ కేటాయించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జనగామ జిల్లాలో సుమారుగా 10 వేల కొత్త పింఛన్లు రావాల్సి ఉంది.