News March 19, 2024

ఇండియా కూటమి ప్రచార జోరు తగినంత లేదా?

image

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఇండియా కూటమి ప్రచారం చర్చనీయాంశమైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మణిపుర్-ముంబై రాహుల్ యాత్ర చేసినా అది రాజకీయంగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనేది విశ్లేషకుల మాట. ఇండియా కూటమి బీజేపీపై విమర్శలకు పరిమితం కాకుండా తమ ఎజెండా ఎంటో వివరించి, ప్రచారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Similar News

News October 1, 2024

నిసాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్.. వచ్చేది ఎప్పుడంటే..

image

కార్ల తయారీ రంగంలో కాంపాక్ట్ SUV మాగ్నైట్‌తో నిసాన్ భారత మార్కెట్‌లో కొంతమేర భాగస్వామ్యం దక్కించుకోగలిగింది. ఈ నేపథ్యంలో ఆ కారు ఫేస్‌లిఫ్ట్‌ను అక్టోబరు 4న తీసుకొస్తోంది. ప్రీలాంఛ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయినట్లు సంస్థ ప్రకటించింది. మారుతీ ఫ్రాంక్స్, బ్రెజా, రెనాల్ట్ కైగర్, కియా సొనెట్ కార్లకు ఇది పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌షోరూమ్‌లో దీని ప్రారంభ ధర సుమారు రూ.6లక్షలు ఉండొచ్చని అంచనా.

News October 1, 2024

రక్తమోడిన రోడ్లు.. ఏడుగురి మృతి

image

TG: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందారు. ఆదిలాబాద్(D) మేకలగండి వద్ద NH-44పై అర్ధరాత్రి డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడడంతో నలుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సాయంత్రం సూర్యాపేట(D) సీతారామపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది.

News October 1, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 1, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:25 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:05 గంటలకు
ఇష: రాత్రి 7.17 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.