News February 7, 2025

గద్వాల: ట్రాన్స్ జెండర్‌‌తో ప్రేమ.. యువకుడి సూసైడ్..?

image

పురుగు మందు తాగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చింతలపేటకు చెందిన నవీన్ అదే కాలనీకి చెందిన ట్రాన్స్ జెండర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం తన తండ్రి సమాధి వద్ద పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి ప్రైవేట్ పార్ట్స్ వద్ద గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 7, 2025

విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు

image

AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్‌గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.

News February 7, 2025

నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

image

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్ షో కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

News February 7, 2025

నార్సింగిలో బాలికపై సామూహిక అత్యాచారం

image

రాజేంద్రనగర్‌లోని నార్సింగి PS పరిధి దారుణం జరిగింది. హైదర్‌షా కోట్‌లో 4 రోజుల క్రితం బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారని బాధితులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

error: Content is protected !!