News February 7, 2025

ఫొటోల మార్ఫింగ్ కేసు.. విచారణకు హాజరైన RGV

image

AP: కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులివ్వడంతో ఒంగోలు రూరల్ పీఎస్‌లో ఇవాళ విచారణకు హాజరయ్యారు.

Similar News

News February 7, 2025

ప్రధాని మోదీని కలిసిన హీరో నాగార్జున

image

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. ANRపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్‌ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించారు.

News February 7, 2025

కశ్మీర్‌లో ఏడుగురు చొరబాటుదారులు హతం

image

దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా కృష్ణ ఘాటీ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్వోసీ దాటి ఇండియన్ ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడికి యత్నించడంతో భారత సైనికులు కాల్పులు జరిపారు.

News February 7, 2025

మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలంటే..

image

RBI కత్తిరించిన 25bps వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందించాలి. అయితే కొన్ని పట్టించుకోకపోవచ్చు. కొన్ని కొంతే తగ్గించొచ్చు. అలాంటప్పుడు మీ హోమ్‌లోన్ EMI తగ్గించుకొనేందుకు ఓ దారుంది. అదే తక్కువ వడ్డీ వసూలు చేసే బ్యాంకుకు మీ లోన్‌ బదిలీ చేసుకోవడం. దీనినే రీఫైనాన్సింగ్ అంటారు. ఈ పోటీ వాతావరణంలో కస్టమర్‌ను వదులుకొనేందుకు ఏ బ్యాంకూ ఇష్టపడదు. మీరు బార్‌గెయిన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు.

error: Content is protected !!