News February 7, 2025
స్వర్ణకవచ అలంకారంలో దర్శనమిచ్చిన రామయ్య
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారు స్వర్ణకవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ,ఆరాధన, ఆరగింపు, సేవాకాలం తదితర నిత్య పూజలు భక్తి ప్రపత్తులతో జరిపారు. అనంతరం స్వామివారి నిత్య కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా కల్యాణం జరిపి, భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News February 7, 2025
KMR: స్పోర్ట్స్ మీట్లో సత్తా చాటిన పోలీసులు
TG పోలీస్ నిర్వహించిన గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ క్రీడల్లో కామారెడ్డి పోలీసులు సత్తా చాటారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సింధుశర్మ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించారు. జిల్లా పోలీసు శాఖకు వివిధ విభాగాల్లో 2 బంగారు పతకాలు, 5 రజత, 3 కాంస్యం పతకాలు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.
News February 7, 2025
HYD: ప్రజాభవన్ ప్రజావాణికి 4,901 దరఖాస్తులు
మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 4,901 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 157, విద్యుత్ శాఖకు సంబంధించి 105, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 30, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 2,865 దరఖాస్తులు వచ్చాయి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 1,640 (రేషన్ కార్డులు) దరఖాస్తులు వచ్చాయి.
News February 7, 2025
వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ వరంగల్ ఉమ్మడి జిల్లా కమిటీ నియామకం
వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇంటర్నేషనల్ కార్యవర్గ సమావేశం శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఆచార్య రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా పరుశరాములు, మహిళా విభాగానికి అధ్యక్షులుగా సంయుక్త, ప్రధాన కార్యదర్శిగా సరళను నియమిస్తూ సంస్థ ఛైర్మన్ మొహమ్మద్ సిరాజుద్దీన్ నియామక పత్రాలను అందజేశారు.