News February 7, 2025
చర్ల: కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని హత్య చేసిన మావోయిస్టులు..!

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు హత్య చేసిన ఘటన చర్ల మండల సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో జరిగింది. అరన్పూర్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా జోగా బోర్సే బరిలో ఉన్నారు. శుక్రవారం మావోయిస్టులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేశారని సమాచారం. దీంతో జోగా బర్సేను హత్య చేసినట్లు తెలుస్తోంది.
Similar News
News March 12, 2026
సంగారెడ్డి: 730 మంది విద్యార్థులు గైర్హాజరు

సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 18,911 మంది విద్యార్థులకు గాను 18,181 మంది (96.14%) హాజరయ్యారని, 730 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.
News March 12, 2026
అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు

ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో 4 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ గురువారం తెలిపారు. జిల్లాలో 72 సెంటర్స్కు సంబంధించిన సెట్ 1,2 ప్రశ్నపత్రాలు పోలిస్స్టేషన్లో భద్రపరిచామన్నారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా నిరంతరాయంగా తనిఖీలు ఉంటాయన్నారు. 11,457మంది పరీక్షలు రాస్తారన్నారు.
News March 12, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.


