News February 7, 2025

ఇసుక తవ్వకాల కేసు.. తుది నివేదిక సమర్పించాలని సుప్రీం ఆదేశం

image

AP: YCP హయాంలో జరిగిన ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తవ్వకాలన్నీ ఆపేసినట్లు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనానికి జయప్రకాశ్ పవర్ వెంచర్స్ న్యాయవాది తెలిపారు. అటు గత విచారణ తర్వాత తీసుకున్న చర్యలను ప్రభుత్వం వివరించింది. దీంతో తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ గమనించిన అంశాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

Similar News

News March 21, 2026

యుద్ధం.. ఇరాన్‌కు లాభాలు!

image

యుద్ధం వల్ల ఇరాన్‌కు నష్టాలతో పాటు లాభాలూ కలుగుతున్నాయి. గత 40 ఏళ్లుగా క్రూడాయిల్ అమ్మకుండా ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు ప్రపంచంలో ఆయిల్ సంక్షోభం తలెత్తడంతో అమెరికా దిగివచ్చి వాటిని ఎత్తివేసింది. ఆయిల్ అమ్ముకోవచ్చంది. ఇక హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే షిప్పులకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోయేది. ఇప్పుడు ఇరాన్ ఒక్కో నౌకకు ఆయిల్ ట్యాంకర్ కంపెనీల నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తోంది.

News March 21, 2026

‘ధురంధర్-2’పై దీపిక సైలెన్స్ ఎందుకు?

image

‘ధురంధర్-2’పై రణ్‌వీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకొణె స్పందించకపోవడంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. భర్త విజయాలను అభినందించడంలో ముందుండే ఆమె ఈసారి ప్రీమియర్లకూ దూరంగా ఉండటంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ధురంధర్ ఫస్ట్ పార్ట్‌కు ఇన్‌స్టాలో ప్రశంసించిన దీపిక ఇప్పుడు SM సైలెన్స్‌ వెనక రీజన్ ఏంటా అని చర్చించుకుంటున్నారు. కాగా దీపిక ఇటీవల రణ్‌వీర్ తల్లి, సోదరితో ముంబైలోని ఓ కన్సర్ట్‌లో మెరిశారు.

News March 21, 2026

‘భగీరథ ప్రయత్నం’ అంటే?

image

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని ‘భగీరథ ప్రయత్నం’ అంటారు. పూర్వం కపిల మహర్షి కోపాగ్నికి ‘సగర’ వంశస్థులు భస్మమవుతారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చడానికి భగీరథుడు చేసిన తపస్సుకు గంగా దేవి మెచ్చారు. కానీ తన వేగాన్ని భూమి తట్టుకోలేదని చెప్పడంతో శివుడి కోసం ప్రార్థిస్తారు. ఆయన గంగను జటాజూటంలో బంధించి భూమిపైకి వదులుతారు. భగీరథుడిని అనుసరిస్తూ గంగ వెళ్లి సగరల బూడిదను తాకి మోక్షం కలిగిస్తారు.
<<-se>>#EPICSAYINGS<<>>