News March 19, 2024
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16మంది వాలంటీర్లపై వేటు

‘సిద్ధం’ సభలో పాల్గొన్నారని 16మంది వాలంటీర్లపై అధికారులు వేటు వేశారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన 16మంది వాలంటీర్లను సస్పెండ్ చేస్తూ ఎంపీడీవో కె.లక్ష్మి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నందుకు వీరిపై చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News July 8, 2025
రాజమండ్రిలో వద్ద ‘దిశ’ సమావేశం

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ‘దిశ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.
News July 8, 2025
తూ.గో: BLOలకు శిక్షణ తరగతులు

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని BLOలకు భారత IIIDEM ఆధ్వర్యంలో 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మొత్తం 1,581 మంది BLOs పాల్గొంటారని, వీరికి 6 బ్యాచులుగా శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు.
News July 8, 2025
రాజమండ్రి: నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్మానుష్య ప్రాంతాల్లో సోమవారం డ్రోన్తో నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం, గంజాయి తాగడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడానికి, నేరాలను కట్టడి చేయడానికి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.