News February 7, 2025
పాక్ ఫుట్బాల్ ఫెడరేషన్ను సస్పెండ్ చేసిన ఫిఫా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738919427050_653-normal-WIFI.webp)
పాకిస్థాన్ ఫుట్బాల్ ఫెడరేషన్(PFF)ను ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఫెడరేషన్(FIFA) సస్పెండ్ చేసింది. నిబంధనలను పాటించడంలో విఫలమైందని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది. PFFలో సజావుగా ఎన్నికల నిర్వహణ, గ్రూపిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా 2019లో నార్మలైజేషన్ కమిటీని ఫిఫా ఏర్పాటు చేసింది. కానీ సత్ఫలితాలు రాలేదు. దీంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. 2017 నుంచి PFF సస్పెన్షన్కు గురికావడం ఇది మూడోసారి.
Similar News
News February 7, 2025
జగన్ మరీ దిగజారిపోయారు: షర్మిల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734152186573_653-normal-WIFI.webp)
AP: మాజీ సీఎం మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. క్యారెక్టర్ ఏంటో ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ‘వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా విజయసాయిరెడ్డితో నా క్యారెక్టర్పై నీచంగా మాట్లాడించారు. వైఎస్ కోరికలకు విరుద్ధంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తీసుకువచ్చి చెప్పించారు. ఇదీ జగన్ మహోన్నత వ్యక్తిత్వం’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News February 7, 2025
ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738941528606_782-normal-WIFI.webp)
AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
News February 7, 2025
అయోధ్య ఆలయ దర్శన సమయం మార్పు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738939263485_1323-normal-WIFI.webp)
అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.