News February 7, 2025

సంగారెడ్డి: పది విద్యార్థులకు అల్పాహారం నిధులు విడుదల

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం నిధులు విడుదల చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున రోజు సాయంత్రం అల్పాహారం అందించేందుకు విద్యార్థికి రూ.15 చొప్పున జిల్లాలో 7,757 మంది విద్యార్థులకు 38 రోజులకు గాను రూ.44,21,490 ను ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.

Similar News

News April 4, 2026

ఇండక్షన్ స్టవ్‌ల తయారీకి ప్రభుత్వం బూస్ట్?

image

ఇండక్షన్ స్టవ్‌లు, హీటర్లు, వాటికి సరిపోయే పాత్రల తయారీని పెంచేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉన్న మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ వివిధ డిపార్ట్‌మెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. యుద్ధం వల్ల వంట గ్యాస్ కొరత తలెత్తిన నేపథ్యంలో ఇండక్షన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.

News April 4, 2026

వరంగల్‌లో వరుస హత్యలు.. 10 రోజుల్లోనే 5 కిరాతకాలు!

image

వరంగల్ జిల్లాలో 10 రోజులుగా జరిగిన వరుస దారుణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అక్రమ సంబంధంతో ఓ కుటుంబాన్ని మట్టుపెట్టిన దుర్మార్గుడు ఒకరు. కట్నం వేధింపులతో మరో కుటుంబాన్ని బలిచేసిన కట్న పిశాచి మరొకరు. ఆడపిల్లలు పుడుతున్నారని, మగ పిల్లవాడు కావాలంటూ భార్య-పిల్లల్ని చంపిన కిరాతకుడు ఇంకొకరు. అదనపు కట్నం కోసం భార్య-మామాను చంపి దహనం చేసిన క్రూరుడు మరొకరు. భార్యాభర్తల మనస్పర్థలు ఐదు పసి ప్రాణాలను హరించాయి.

News April 4, 2026

విశాఖ: యుద్ధ నౌక ‘తారాగిరి’ విశేషాలు తెలుసా..!

image

ప్రాజెక్ట్-17A కింద నిర్మించిన స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ ‘ఐఎన్‌ఎస్ తారాగిరి’ నౌకాదళంలో శుక్రవారం చేరింది. శత్రు రాడార్‌లకు చిక్కకుండా ఉండే టెక్నాలజీతో రూపొందిన ఈ నౌకలో బ్రహ్మోస్, బరాక్-8 క్షిపణులు ఉన్నాయి. 75%కిపైగా స్వదేశీ భాగాలతో దీనిని ముంబైలో నిర్మించారు. అధునాతన రాడార్, సోనార్ సిస్టమ్‌లతో శత్రు కదలికలను ముందే గుర్తించగలదు. సముద్ర భద్రత, నిఘా, విపత్తు సహాయక చర్యల్లో కీలకంగా ఉండనుంది.