News February 7, 2025
జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.
Similar News
News March 19, 2026
విశాఖ: ‘జోన్ ప్రారంభ తేదీపై స్పష్టత లేదు’

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభంపై స్పష్టమైన తేదీని ఇంకా నిర్ణయించలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లోక్ సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటుకు సంబంధించిన నిధుల కేటాయింపు, భూసేకరణ, మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని, అయితే కార్యకలాపాల ప్రారంభానికి ఇంకా కాలపరిమితి ఖరారు కాలేదని స్పష్టం చేశారు.
News March 19, 2026
గ్రామాల్లో ఓటర్ల జాబితా ప్రదర్శించాల్సిందే: SEC

AP: సర్పంచ్ ఎన్నికల కోసం పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా <<19333584>>ప్రచురణకు<<>> మరో 4 వారాలు గడువు పొడిగించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని SEC నీలం సాహ్ని తిరస్కరించారు. ఇప్పటికే 13,351 పంచాయతీల్లో ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని ఆమె తెలిపారు. గడువు పెంపునకు సరైన కారణాలు లేవన్నారు. సాంకేతిక కారణాలతో ఎక్కడైనా జాబితా ప్రచురణ ఆలస్యమైతే పరిశీలించి తగిన ఆదేశాలిస్తామని పేర్కొన్నారు.
News March 19, 2026
అనకాపల్లి: పదో తరగతి హిందీ పరీక్షకు 62 మంది గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హింది పరీక్షకు 62 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. 102 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 20,581 మంది హాజరుకావాల్సి ఉండగా, 20,519 విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు.


