News February 7, 2025

జగిత్యాల: క్వింటాల్ నువ్వుల ధర రూ. 10,000

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు వివిధ దినుసులకు పలికిన ధరలు ఇలా ఉన్నాయి. కందులు క్వింటాల్ కనిష్ఠ ధర రూ. 5,455, గరిష్ఠ ధర రూ. 6,401గా నమోదయ్యాయి. అనుములు కనిష్ఠ ధర రూ. 3,159, గరిష్ఠ ధర రూ. 7,685గా ఉన్నాయి. మక్కల ధర రూ. 2,281గా ఉంది. అటు నువ్వులు క్వింటాల్ ధర రూ. 10 వేలు పలికింది. ఈ మేరకు మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ వివరాలు వెల్లడించారు.

Similar News

News February 7, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

image

TG: రెండో శనివారం సందర్భంగా రెగ్యులర్‌గా రేపు స్కూళ్లకు సెలవు ఉంటుంది. అయితే కొన్ని స్కూళ్లు సెలవును రద్దు చేశాయి. రేపు స్కూలుకు రావాలని హైదరాబాద్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాయి. విద్యా సంవత్సరం ముగియనుండటం, సిలబస్ పూర్తి కాకపోవడం, స్కూలు పనిదినాలు తగ్గడం సహా పలు కారణాలతో FEB 8న సెలవును రద్దు చేశాయి. మరి రేపు సెలవు లేదని మీ స్కూలు నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News February 7, 2025

ప్రధానితో భేటీపై నాగార్జున ట్వీట్

image

ప్రధాని మోదీతో భేటీపై నాగార్జున స్పందించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించడంపై నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బుక్‌ను మోదీకి అందించడం గౌరవంగా భావిస్తున్నానని, ఇది తన తండ్రి సినీ వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన సేవలను మోదీ గుర్తించడం తమ కుటుంబం, దేశ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున పేర్కొన్నారు.

News February 7, 2025

బిక్కనూర్: ప్రమాదాల నివారణకు చర్యలు: అడిషనల్ ఎస్పీ

image

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. శుక్రవారం బిక్కనూర్ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆమె పలు సలహాలు, సూచనలు చేశారు. ఆమె వెంట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

error: Content is protected !!