News February 7, 2025
సిరిసిల్ల: డైరీ, టెక్స్టైల్ ఎగుమతులు పెంచాలి: కలెక్టర్
డైరీ, టెక్స్ టైల్ రంగాల్లో ఎగుమతుల పెంపునకు కృషిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డిస్ట్రిక్ట్ లెవెల్ ఎకోస్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ) సమావేశం నిర్వహించారు.
Similar News
News February 7, 2025
ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం
AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
News February 7, 2025
అయోధ్య ఆలయ దర్శన సమయం మార్పు
అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.
News February 7, 2025
చొప్పదండి: నవోదయ పరిమిత సీట్ల ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
చొప్పదండి నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతులలో పరిమిత సీట్లకు శనివారం జరిగే ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 1340 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 11వ తరగతిలో ప్రవేశానికి 1278 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రిన్సిపల్ మంగతాయారు తెలిపారు. అభ్యర్థులు 10 గంటల లోపు హాల్ టికెట్, ఆధార్ కార్డుతో హాజరు కావాలని ప్రిన్సిపల్ సూచించారు.