News February 7, 2025
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738749102239_782-normal-WIFI.webp)
AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
Similar News
News February 7, 2025
ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738941528606_782-normal-WIFI.webp)
AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
News February 7, 2025
అయోధ్య ఆలయ దర్శన సమయం మార్పు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738939263485_1323-normal-WIFI.webp)
అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.
News February 7, 2025
బీసీ నేతలతో కేటీఆర్ భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737033485764_653-normal-WIFI.webp)
TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఆయన సమావేశమై బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.