News February 7, 2025
విజన్-2047కు సహకరించండి: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738927390290_1032-normal-WIFI.webp)
AP: స్వర్ణాంధ్ర విజన్ 2047కు సహకరించాలని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీని CM చంద్రబాబు కోరారు. అమరావతిలో ఆయనతో CM భేటీ అయ్యారు. ‘రాష్ట్రంలో ఏటా 15 శాతం వృద్ధి సాధించి 2047కల్లా 42 వేల డాలర్ల తలసరి ఆదాయానికి అందరూ చేరుకునేలా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో అత్యుత్తమ పాలసీలు అమలు చేస్తున్నాం. నీతి ఆయోగ్ మద్దతు ఉంటే ఇంకాస్త ముందుకెళ్తాం. 2047కల్లా APని మోడల్ స్టేట్గా మార్చవచ్చు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
రీఛార్జ్ చేయకున్నా కాల్స్ మాట్లాడొచ్చు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738931316161_746-normal-WIFI.webp)
సింపుల్ ట్రిక్ పాటిస్తే ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అందుకోసం మీ స్మార్ట్ ఫోన్లో వైఫై కాలింగ్ ఫీచర్ ఉండాలి. మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా వైఫై కనెక్షన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. దీనిని యాక్టివేట్ చేసుకునేందుకు Settings> Network> Internet Settings > Sim & Mobile network> Sim> Wifi Calling Toggle> activate చేయాలి. మొబైల్ నెట్వర్క్ సరిగా లేనప్పుడు ఆటోమేటిక్గా వైఫైతో కాల్స్ చేసుకోవచ్చు.
News February 7, 2025
CT: పాకిస్థాన్ జెర్సీ ఆవిష్కరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738944926890_1032-normal-WIFI.webp)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు హోస్ట్ పాకిస్థాన్ తన జెర్సీ ఆవిష్కరించింది. గత జెర్సీకి భిన్నంగా దీనిని రూపొందించారు. కాగా ఇవాళ లాహోర్లోని గడాఫీ స్టేడియాన్ని PCB పున:ప్రారంభించింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఈ మైదానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. కొత్త ఫ్లడ్లైట్లు, సీట్లు, ఎలక్ట్రానిక్ స్కోరు బోర్డులు, ఎల్ఈడీ టవర్లు, వీవీఐపీ బాక్సులు వంటివి నిర్మించారు. కాగా పాక్ ఆటగాళ్ల జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 7, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908589618-normal-WIFI.webp)
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నెల 10, 12, 15న పీవో, ఏపీవోలకు శిక్షణ ఇవ్వనుండగా, 10వ తేదీలోగా సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగా తొలుత ZPTC, MPTC ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.