News February 7, 2025
ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన ఖరారు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738930587440_782-normal-WIFI.webp)
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పీఎంవో తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్రాన్స్లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి ఏఐ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే అక్కడ ఉన్న థర్మో న్యూక్లియర్ రియాక్టర్ను సందర్శించనున్నారు. అనంతరం 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించనున్నారు. ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన US వెళ్లనున్నారు.
Similar News
News February 8, 2025
130 కి.మీ వేగంవెళ్లేలా రైల్వేట్రాక్ అప్గ్రేడ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738947786136_1323-normal-WIFI.webp)
విజయవాడ రైల్వేడివిజన్ పరిధిలోని ట్రాక్ను గంటకు130 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఆధునీకీకరించనున్నారు. మెుత్తంగా 1,287 KM మేర ట్రాక్ అప్గ్రేడ్ చేయదలచగా ఇప్పటివరకూ 58శాతం మేర పనులు పూర్తయినట్లు డివిజన్ ఇంజినీర్ వరుణ్బాబు తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాలను ఆధునీకీకరించనున్నారు. నిడవదొలు -భీమవరం, నరసాపురం-గుడివాడ-మచిలీపట్నం, సామర్లకోట మార్గాల్లో ట్రాక్ అప్గ్రేడ్ పూర్తయిందని తెలిపారు.
News February 8, 2025
పడుకునే ముందు ఇవి తాగుతున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738946083776_1032-normal-WIFI.webp)
రోజూ పడుకునే ముందు కొన్ని పానీయాలు తీసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి హాయిగా నిద్రపట్టేందుకు సహకరిస్తాయని అంటున్నారు. లావెండర్ టీ తాగితే ఒత్తిడి తగ్గి మంచి నిద్ర కలుగుతుంది. చమోమిలే టీ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కలిగి ప్రశాంతంగా నిద్ర వస్తుంది. పిప్పరమెంట్ టీ కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. వేడి పాలలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే నాడీ వ్యవస్థ రిలాక్స్గా మారుతుంది.
News February 8, 2025
కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738934951246_1032-normal-WIFI.webp)
మరో బాలీవుడ్ నటి సన్యాసినిగా మారారు. నటి ఇషికా తనేజా కుంభమేళాలో సన్యాసం స్వీకరించారు. ఇకపై తాను సినిమాల్లో నటించనని పుణ్యస్నానం ఆచరించి ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇషికా 2018లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.