News February 7, 2025

అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాలు, స్టాక్ పాయింట్ల ద్వారా స‌ర‌ఫ‌రా ప్ర‌క్రియ‌లు స‌జావుగా జ‌రిగేలా వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో పనిచేయాల‌ని అంత‌ర్రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో నిఘా పెంచాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. శుక్ర‌వారం జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప‌ర్యావ‌ర‌ణ‌, ఇత‌ర అనుమ‌తుల ఆధారంగా త‌వ్వ‌కాలు జ‌రిగేలా, స‌ర‌ఫ‌రాలో ఆటంకం లేకుండా చూడాలన్నారు.

Similar News

News November 6, 2025

గోదావరిఖని: సమ్మక్క జాతరకు ఏర్పాట్లు: ఛైర్మన్‌

image

గోదావరి నది ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అభివృద్ధి చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్‌ పిన్నింటి శ్రీనివాస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సింగరేణి రూ.3 కోట్లు, NTPC రూ.57 లక్షలు, RFCL రూ.35 లక్షలు, మిగతా ఏర్పాట్లుకు రామగుండం కార్పొరేషన్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్‌లోగా జాతర అభివృద్ధి పనులు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామన్నారు.

News November 6, 2025

గోదావరిఖని: ‘గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలి’

image

సింగరేణి గుర్తింపు సంఘం ద్వంద్వ వైఖరి విధానాలను మానుకోవాలని సీఐటీయూ-ఎస్‌సీఈయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడారు. గతంలో లాభాల విషయంలో సీఎంతో కలిసి చెక్కులు ఇచ్చి, బయటకు వచ్చి ఖండిస్తున్నామన్నారని తెలిపారు. ఇప్పుడు 100 నుంచి 150 మస్టర్లకు పెంచిన అంశాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటనలు చేసి, కార్మికుల వ్యతిరేకతతో ధర్నాలకు పిలుపునివ్వడం సరికాదన్నారు.

News November 6, 2025

భామిని: ‘విద్యార్థులు క్రీడల్లో రాణించాలి’

image

జన జాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలను ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథం గురువారం సీతంపేటలో ప్రారంభించారు. పీవో క్రీడాకారుల ఉద్దేశించి మాట్లాడుతూ..విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రానించాలని సూచించారు. క్రీడలతో విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ అన్నదొర, స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి జోకబ్, సూపరింటిండెంట్ అప్పారావు ఉన్నారు.